న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఇంధన పొదుపులో హెరిటేజ్ ఫుడ్స్ అవార్డు-2017కి రెండవ బహుమతి లభించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీసియన్సీ (బీఈఈ) నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమక్షంలో, ఇంధన శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నారా బ్రహ్మణి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... కంపెనీ సంప్రదాయేతర ఇంధనంపై కంపెనీ దృష్టి పెడుతోందని, జాతీయ ఇంధన పొదుపు అవార్డును అందుకోవడం ఇది ఎనిమిదోసారని చెప్పారు. 14.5 శాతం విద్యుత్ యూనిట్లను కంపెనీ అదా చేయగలుగుతుందని, నగదు రూపంలో ఏడాదికి రూ.35 లక్షలు పొదుపు చేయగలుతున్నామని తెలిపారు. మరింత ఇంధనాన్ని పొదుపు చేయడానికి కృషి చేస్తామని అన్నారు.