ముంబాయి, డిసెంబర్ 15: మూడు రోజులుగా నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. ప్రారంభంలో 358 పాయింట్ల లాభాలను నమోదు చేసి 33,549 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ సైతం 98 పాయింట్లు పుంజుకుని 10,350 వద్ద కొనసాగుతుంది. గుజరాత్ బీజేపీకి ఎదురు లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో దలాల్స్ట్రీట్లో ఉత్సాహం నెలకొంది. మెటల్, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆటో సెక్టార్లో కొనుగోళ్లు భారీగా నెలకొన్నాయి. టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.