‘శాకుంతలం’లో మరో స్టార్ హీరోయిన్!

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 01:35 PM

‘శాకుంతలం’లో మరో స్టార్ హీరోయిన్!

గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాలో కావ్యనాయకీ పాత్రలో సమంత అక్కినేని నటిస్తుండగా.. నాయకుడు దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోషన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సమంత ప్రీ లుక్‌కి విశేష స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త.. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. కథ ప్రకారం శకుంతలకి ప్రియంవద అనే ఇష్టసఖి ఉంటుంది. ఈ పాత్ర కోసం తొలుత ఈషా రెబ్బాను అనుకున్నారట.. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈషాను ఈ పాత్ర నుంచి తప్పించారని తెలుస్తోంది. ఆమె స్థానంలో తమిళనటి ‘అదితి బాలన్’ను తీసుకున్నారని సమాచారం. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుందని టాక్ కూడా వినిపిస్తోంది. అదితి బాలన్ తమిళంలో 'అరువి' సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు మెచ్చి గుణశేఖర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రని ఆమెకి ఆఫర్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ సినిమాకి గుణశేఖర్ సతీమణి నీలిమా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements