RR vs PBKS : ఫీల్డింగ్ ఎంచుకున్న సంజు శాంసన్

     Written by : smtv Desk | Mon, Apr 12, 2021, 07:07 PM

RR vs PBKS : ఫీల్డింగ్ ఎంచుకున్న సంజు శాంసన్

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ రెండు జట్లూ పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ టీమ్.. ఆరింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టింది. ఇక రాజస్థాన్ రాయల్స్ టీమ్ కూడా ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి.. పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. దాంతో.. కనీసం ఈ ఏడాదైనా ప్లేఆఫ్‌కి చేరాలని ఈ రెండు జట్లూ ఆశిస్తున్నాయి.

రికార్డుల పరంగా చూసుకుంటే ఇప్పటి వరకూ పంజాబ్, రాజస్థాన్ జట్లు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ టీమ్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ టీమ్ విజయం సాధించింది. టీమ్స్ స్కోరు పరంగా చూసుకుంటే ఈ రెండు జట్లు తలపడిన సమయంలో భారీ స్కోర్లు నమోదవుతూ వస్తున్నాయి. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. రాజస్థాన్‌పై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులుకాగా.. అత్యల్ప స్కోరు 124. ఇక పంజాబ్‌పై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 226 పరుగులుకాగా.. అత్యల్ప స్కోరు 112.





Untitled Document
Advertisements