కేసీఆర్‎తో సీఎస్ భేటీ...తెలంగాణలో నైట్ కర్ఫ్యూ?!

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 03:01 PM

కేసీఆర్‎తో సీఎస్ భేటీ...తెలంగాణలో నైట్ కర్ఫ్యూ?!

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్‎లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలుఅంశాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలను సోమేశ్ సేకరిస్తున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‎తో సీఎస్ భేటీ కానున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనపై సీఎం సీఎస్‌తో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండే జాగ్రత్తలపై సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎస్. అటు దేవాలయాల వద్ద రద్దీ, ఆలయాల్లో కరోనా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‎తో సీఎస్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.

మరోవైపు రంజాన్ మాసం నేపథ్యంలో కరోనా కట్టడిపై అప్రతమత్తత ఉండేలా సూచనలు తీసుకోనున్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం సీఎస్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ విధించాలా..? వద్దా..? అనేదానిపై ఇవాళ ఓ ప్రభుత్వం ఓ క్లారిటీకి రానుంది.





Untitled Document
Advertisements