సేఫ్ ఇన్వెస్ట్...అధిక రాబడి

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 05:49 PM

సేఫ్ ఇన్వెస్ట్...అధిక రాబడి

డబ్బు సంపాదించడానికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమే కష్టపడి వ్యాపారం చేయడం లేదంటే ఉద్యోగం చేసి డబ్బులు వెనకేయడం. మరొకటేమో చేతిలోని డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడి సొంతం చేసుకోవడం. ఇలా మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టడం ద్వారా డబ్బులు పొందొచ్చు. బ్యాంకులు 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. పదేళ్ల వరకు మీరు ఎఫ్‌డీ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీలో డబ్బులు దాచుకునే వారు ఒక విషయం తెలుసుకోవాలి. రూ.5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది.

అలాగే పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ SCSS, సుకన్య సమృద్ధి యోజన SSY వంటి పలు రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది.

ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా డబ్బులు దాచుకోవచ్చు. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. అయితే మీ ఇన్వెస్ట్‌మెంట్లను దీర్ఘకాంలో కొనసాగించాలి. అప్పుడు మంచి రిటర్న్ వస్తుంది. ఈక్విటీ, డెట్ ఫండ్స్ వంటివి ఉంటాయి. 15 శాతం వరకు రాబడి పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌లో కూడా డబ్బులు పెట్టొచ్చు.

అలాగే బంగారంలో కూడా డబ్బులు పెట్టొచ్చు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. గోల్డ్ బాండ్లు కొనొచ్చు. లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో డబ్బులు పెట్టొచ్చు. ఇలా చేయడం ద్వారా ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. అయితే బంగారాన్ని నేరుగా కొనడం కన్నా ఇలా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.





Untitled Document
Advertisements