ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 05:50 PM

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్

ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్‌లోకి దూసుకొచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న బెంగళూరు.. మొత్తం 4 పాయింట్లతో నెం.1 స్థానానికి ఎగబాకింది. టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనూ ముంబయి ఇండియన్స్‌పై 2 వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపొందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందు బెంగళూరు నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.

పాయింట్ల పట్టికలో బెంగళూరు తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టాప్-4లో నిలిచాయి. సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. ఇక బెంగళూరు చేతిలో ఓడిన హైదరాబాద్ ఏడో స్థానానికి పరిమితమవగా.. చెన్నై సూపర్ కింగ్స్ చిట్టచివరి స్థానంలోనే కొనసాగుతోంది. ఐదు, ఆరు స్థానాల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి.

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే..? ఆ జట్టు నెం.1 స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఎందుకంటే.. బెంగళూరు నెట్‌ రన్‌రేట్ +0.175‌తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్‌రేట్ +0.779 మెరుగ్గా ఉంది.





Untitled Document
Advertisements