హైదరాబాద్ కి ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సాదిఖ్ ఇకలేడు

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:08 PM

హైదరాబాద్ కి ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సాదిఖ్ ఇకలేడు

హైదరాబాద్ నగరానికి ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సాదిఖ్ అనే బాలుడు మరణించాడు. కరీంనగర్ జిల్లాలోని రేకుర్తికి చెందిన సాదిఖ్ చాలాకాలంగా బ్లడ్ క్యాన్సర్(లుకేమియా)తో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న సాదిఖ్ కలలను క్యాన్సర్ మహమ్మారి చిదిమేసింది. సాదిఖ్ పరిస్థితి తెలుసుకున్న మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకుని 2014 అక్టోబర్‌ 15న సాదిఖ్‌ను హైదరాబాద్‌ నగరానికి ఒక రోజు పోలీస్ కమిషనర్‌గా చేసింది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా కొనసాగుతున్న ఎం. మహేందర్‌రెడ్డి అప్పట్లో నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించిన సాదిఖ్ ఒకరోజు కమిషనర్‌గా విధులు నిర్వర్తించాడు. సాదిఖ్‌‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బుధవారం స్వగ్రామంలో అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని బాలుడి తండ్రి జావేద్ బాషా గురువారం తెలిపారు. తన కుమారుడి చివరి కోరిక తీర్చిన పోలీసులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.





Untitled Document
Advertisements