రూ.10 వేలు పెడితే రూ.లక్ష!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 02:26 PM

రూ.10 వేలు పెడితే  రూ.లక్ష!

స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే అధిక రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఈటీఎఫ్ స్కీమ్ ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాన్ని అందిస్తోంది. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ నష్టపోతోంది. చాలా ఫండ్స్ నష్టాలనే అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా ఈ ఫండ్ లాభాలను అర్జించి పెడుతోంది.

గత పదేళ్లుగా చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చాలా ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. అయితే టెక్నాలజీ షేర్లు మాత్రం పరుగులు పెడుతూ వచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఈటీఎఫ్ కూడా అమెరికా టెక్నాలజీ స్టాక్స్‌లో డబ్బులు పెట్టింది. దీంతో ఫండ్ పనితీరు అదిరిపోయింది.

రానున్న రోజుల్లోనే ఈ ఫండ్ మంచి పనితీరు కనబర్చవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే నాస్‌డాక్ తన ఆల్‌టైమ్ గరిష్టానికి ఇంచా చాలా దూరంలో ఉంది. అందువల్ల వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ఈటీఎఫ్ ఫండ్ మంచి పనితీరు కనబరచవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

మీరు పదేళ్ల కింద ఈ ఫండ్‌లో రూ.10 వేలు పెట్టి ఉంటే.. ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.లక్షగా ఉండేది. ఈ ఫండ్ పదేళ్ల కాలంలో ఏకంగా 910 శాతం రాబడి అందించింది. అదే రెండేళ్ల కాలంలో చూస్తే మీ డబ్బు రెట్టింపు అయ్యేది. రూ.10 వేలకు రూ.19,500 వచ్చేది.





Untitled Document
Advertisements