"లాజిక్స్ లేని పాలి 'ట్రిక్స్' " ....కరోనాపై RGV షాకింగ్ కామెంట్స్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 04:45 PM


ఇష్యూ ఏదైనా సరే సెన్సేషన్ చేయడంలో రామ్ గోపాల్ వర్మను మించిన పర్సనాలిటీ లేదని చెప్పడంలో అతిశయోక్తిలేదు. అది ఎలాంటి సందర్భం అయినా తనదైన శైలిలో లాజిక్స్ మాట్లాడుతూ రచ్చరచ్చ చేసే ఆయన, దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనాపై వరుస ట్వీట్స్ పెడుతూ రాజకీయ వర్గాలపై సెటైర్స్ వేస్తున్నారు. కరోనా వీర విజృంభణ చేస్తుంటే కట్టడి చేసేది పోయి కుంభమేళా, సభలు అంటూ వెళ్తున్న ప్రభుత్వ పోకడను తప్పుబడుతూ సంచలన కామెంట్స్ చేశారు వర్మ.

తన రెగ్యులర్ అస్త్రం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రభుత్వ తీరును ఎండగట్టిన వర్మ.. లాజిక్స్ లేని పాలి 'ట్రిక్స్' ప్లే చేస్తున్నారంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అన్ని దేశాలు కరోనా నివారణకు చర్యలు చేపడుతుంటే.. ఈ దేశం మాత్రం కరోనా పెరుగుదలకు కుంభమేళా నిర్వహిస్తుందంటూ వస్తున్న విమర్శలకు బూస్టింగ్ ఇస్తూ ట్వీట్స్ చేశారు. 'కుంభమేళ అనేది ఇండియాకు గుడ్‌బై చెబుతూ.. కరోనాను వెల్‌కమ్ చేస్తోంది' అంటూ కరోనాపై కామెంట్స్ మొదలుపెట్టిన ఆయన, దాని కంటిన్యూ చేస్తూ కెలుకుతూనే ఉన్నారు.
మాస్క్ లేకుంటే కామన్ మ్యాన్‌కి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు మరి కుంభమేళా సమయంలో ఉత్తరాఖండ్ సీఎం సహా ఇంకొంతమంది రాజకీయ ప్రముఖులు మాస్క్ పెట్టుకోలేదు.. మరి వాళ్లకు ఎంత ఫైన్ వేస్తారంటూ ఓపెన్ కామెంట్ చేశారు. ఈ కుంభమేళాతో పాటు పొలిటికల్ ర్యాలీస్ తీస్తుండటం చూస్తుంటే రాజకీయ నాయకులు కేవలం ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారనేది స్పష్టం చేస్తోందని కామెంట్ చేసిన వర్మ.. అదే మనిషి మరణిస్తే ఓటెవడు వేస్తాడనే కనీస లాజిక్ కూడా ప్రభుత్వానికి తెలియడం లేదంటూ సెన్సేషనల్ రియాక్షన్ ఇచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.





Untitled Document
Advertisements