కరోనాతో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 04:46 PM

కరోనాతో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి

సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కరోనాతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయినట్టు పీటీఐ తెలిపింది. రంజిత్ సిన్హా శుక్రవారం వేకువజామున 4.30 గం.లకు ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1974 బీహార్ బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి అయిన రంజిత్ సిన్హా.. 2021 డిసెంబరు నుంచి 2014 డిసెంబరు వరకు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నారు.

అంతకు ముందు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ డైరెక్టర్ జనరల్‌గా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) చీఫ్‌గా పలు కీలక హోదాల్లో ఆయన సేవలందించారు. రంజిత్ సిన్హా మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. సీబీఐ డైరెక్టర్‌గా సిన్హా పదవీకాలం అత్యంత గందరగోళంగా సాగింది. ఆయన 2014లో ఒకదాని తరువాత మరొకటి వరుస వివాదంలో ఇరుక్కున్నారు.

ఇష్రత్ జహాన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఝార్ఖండ్ బొగ్గు గనుల కుంభకోణం కేసులో నిందితులతో చేతులు కలిపి, సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

బొగ్గు కుంభకోణం విచారణను ప్రభావితం చేసేందుకు అప్పటి సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ప్రయత్నించారని 2016లో అప్పటి అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ చైర్మన్‌గా బొగ్గు కుంభకోణం కేసును అప్పటి సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా దర్యాప్తు చేశారు. సిన్హా ఇంటి వద్ద దొరికిన డైరీ నిజమైనవని అటార్నీ జనరల్ కోర్టులో వాదించారు.





Untitled Document
Advertisements