అనారోగ్యంతో నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 04:47 PM

అనారోగ్యంతో నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కాకర్ల సుబ్బారావు పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది. అనంతరం విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్‌ పట్టా పొందారు.

1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి రేడియాలజీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 1954-56 మధ్య న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత అదే కాలేజీలో చీఫ్ రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. అనంతరం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు.





Untitled Document
Advertisements