గోల్డ్ లోన్ తీసుకునేవారు ఇలా చేయకపోతే మీ బంగారం పోయినట్టే

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 05:45 PM

గోల్డ్ లోన్ తీసుకునేవారు ఇలా చేయకపోతే మీ బంగారం పోయినట్టే

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలా మంది చేసే పని ఒక్కటే. ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో లేదంటే గోల్డ్ లోన్ సంస్థల్లో పెట్టి రుణం తెచ్చుకుంటూ ఉంటారు. ఇది చాలా ఈజీ. బంగారం ఉంటే వెంటనే నిమిషాల్లో లోన్ వచ్చేస్తుంది. అయితే సులభంగానే వస్తోంది కదా? అని అజాగ్రత్తగా ఉంటే మాత్రం బంగారం పొగొట్టుకోవాల్సి రావొచ్చు.

గోల్డ్ లోన్ తీసుకునే వారికి వారి బంగారం విలువలో 75 శాతం మొత్తానికి సమానంగా రుణం ఇస్తారు. మార్చి 31 వరకు అయితే 90 శాతం వరకు లోన్ ఇచ్చే వారు. ఇప్పుడు 75 శాతం వరకు రుణం ఇస్తున్నారు. అంటే మీకు రూ.100కు రూ.75 రుణం వస్తుంది. ఇలా మీరు లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ లేదంటే వడ్డీ డబ్బులు కచ్చితంగా చెల్లిస్తూ రావాలి.

మీరు ఇలా మీ ఈఎంఐ లేదా వడ్డీ కరెక్ట్ టైమ్‌కి కట్టకపోతే బ్యాంకులు లేదా గోల్డ్ సంస్థలు మీకు నోటీసులు పంపుతాయి. నోటీసులో ఉన్న టైమ్‌లోగా డబ్బులు కట్టకపోతే మీ బంగారాన్ని అవి అమ్మేస్తాయి. అందువల్ల మీరు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే గోల్డ్ లోన్ తీసుకోండి.

అంతేకాకుండా మరో సందర్భంలో కూడా మీ బంగారాన్ని బ్యాంకులు లేదాంటే గోల్డ్ లోన్ సంస్థలు విక్రయించే ఛాన్స్ ఉంది. బంగారం ధర ఎక్కువగా ఉన్నప్పుడు మీ బంగారానికి ఎక్కువ రుణం లభిస్తుంది. అదే తక్కువ రేటు ఉంటే తక్కువ రుణం వస్తుంది. ఎక్కువ రుణం తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలి.

ఎందకంటే.. బంగారం రేటు తగ్గినప్పుడు ఎల్‌టీవీ రేషియో ప్రకారం మీకు ఎక్కువ రుణం వచ్చినట్లు అవుతుంది. దీంతో బ్యాంకుల మిమ్మల్ని ఆ అదనపు డబ్బులు వెంటనే చెల్లించాలని కోరొచ్చు. మీరు కట్టకపోతే మీ బంగారాన్ని విక్రయించే అధికారం బ్యాంకులకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.





Untitled Document
Advertisements