LIC కస్టమర్లకు అలర్ట్....కేంద్రం కీలక నిర్ణయం!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 05:59 PM

LIC కస్టమర్లకు అలర్ట్....కేంద్రం కీలక నిర్ణయం!

దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఉద్యోగులకు, కస్టమర్లకు ముఖ్యమైన గమనిక. ఉద్యోగులకు రెండు తీపికబుర్లు అందాయి. అలాగే పాలసీదారులు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం దాదాపు 1.14 లక్షల మంది ఉద్యోగులకు శుభవార్త అందించింది. వారానికి ఐదు రోజుల పని దినాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇకపై ఎల్‌ఐసీ ఎంప్లాయీస్‌కు వారంలో రెండు రోజులు సెలవులు ఉంటాయి. శనివారం, ఆదివారం ఎల్‌ఐసీ ఉద్యోగులకు సెలవు.

దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనివారం ఎల్‌ఐసీ ఆఫీస్‌లు ఉండవని గమనించాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకే కస్టమర్లు వారి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు పనితో పాటు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదే వేతన పెంపు.

ఎల్‌ఐసీ ఉద్యోగులకు 25 శాతం వరకు వేతన పెంపునకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఒకేరోజు రెండు శుభవార్తలు అందాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎల్‌ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవో పనులు ప్రారంభం కానున్నాయి.





Untitled Document
Advertisements