ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త... బ్యాంక్ ప్రత్యేకమైన స్కీమ్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 06:35 PM

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త... బ్యాంక్ ప్రత్యేకమైన స్కీమ్

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకు చెందిన ఎస్‌బీఐ కార్డ్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. పెద్ద మొత్తంలో చేసిన కొనుగోళ్లను ఈజీ ఈఎంఐ రూపంలోకి మార్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది.

అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా కల్పిస్తోంది. కస్టమర్లు వారి కొనుగోళ్లను ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం మాఫీ కల్పిస్తోంది. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వెసులుబాటు వల్ల ఊరట కలుగుతుంది.

ఎస్‌బీఐ కార్డ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఫ్లెక్సీ ఈఎంఐ ఆఫర్ మే 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పెద్ద మొత్తంలో చేసిన కొనుగోళ్లను తక్కువ వడ్డీ రేటుతో ఈఎంఐలోకి మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. ట్రాన్సాక్షన్ నిర్వహించిన 30 రోజుల్లోగా ఈ వెసులుబాటు పొందొచ్చు.



రూ.500కు పైన చేసిన ఏ లావాదేవీనైనా ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఈఎంఐ బుకింగ్ అమౌంట్ కనీసం రూ.2,500గా ఉండాలి. 6, 9, 12, 24 నెలల కాల పరిమితితో ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ.1000కు రూ.52 చెల్లించాలి. అంటే రూ.10 వేలకు రూ.520 ఈఎంఐ. 12 నెలలకు అయితే రూ.94, ఆరు నెలలకు అయితే రూ.176 పడుతుంది.





Untitled Document
Advertisements