ఏపీలో కరోనా విజృంభణ....పీఎం మోదీకి జగన్ లేఖ

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 06:43 PM

ఏపీలో కరోనా విజృంభణ....పీఎం మోదీకి జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నారు. గురువారం ఒక్క రోజే 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటేలా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి వెంటనే 60 లక్షల డోసుల వ్యాక్సిన్‌ పంపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒక్క రోజే 6,28,961 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసే విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాల అవసరాలను ఒక వాలంటీరు తీరుస్తున్నారని ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను వాలంటీర్లు సమర్థంగా చేపట్టారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కరోనా వ్యాక్సిన్‌ అందేలా చూస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. వచ్చే మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఆ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌కు తక్షణమే 60 లక్షల డోసులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.





Untitled Document
Advertisements