దిగ్గజ బ్యాంకుల గుడ్ న్యూ్స్....వాటి గడువు పొడిగింపు

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 07:42 PM

దిగ్గజ బ్యాంకుల గుడ్ న్యూ్స్....వాటి గడువు పొడిగింపు

దేశీ దిగ్గజ బ్యాంకులు కస్టమర్లకు తీపికబురు అందించాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అలాగే మరో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకున్నాయి.

ప్రత్యేకమైన సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ FD స్కీమ్స్ గడువును పొడిగించాయి. ఈ బ్యాంకులు అందించే స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ 2021 జూన్ 30 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో చేరిన వారికి సాధారణ ఎఫ్‌డీల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఎస్‌బీఐ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకంలో చేరిన సీనియర్ సిటిజన్స్‌కు 30 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇది 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీకి మళ్లీ అదనం. ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితితో చేసే ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ ఎఫ్‌డీలపై 6.2 శాతం వడ్డీ వస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ అందిస్తోంది. ఈ ఎఫ్‌‌డీలో చేరిన వారికి 0.25 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. సాధారణ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్స్‌కు అధికంగా లభించే 0.5 శాతం వడ్డీకి ఇది మళ్లీ అదనం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ కింద 6.25 శాతం వడ్డీ అందిస్తోంది.



ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇందులో చేరితే 6.3 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్లకు పైన డబ్బులు దాచుకునే వారికే ఇది వర్తిస్తుంది. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ అన్ని జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.





Untitled Document
Advertisements