కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్‌కి కరోనా

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 12:07 PM

కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్‌కి కరోనా

దేశాన్ని కరోనా కల్లోలం కమ్మేస్తోంది. రోజుకి రెండు లక్షలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్- 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీటర్ ద్వారా తెలియజేశారు. రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. జావదేకర్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నప్పటికీ వైరస్ సోకింది.

ఈరోజు పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కర్ణాటక సీఎం బీఎస్‌ యెడియూరప్పకి రెండో సారి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన గతేడాది కరోనా బారిన పడినప్పటికీ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులకు కరోనా వైరస్ సోకింది. ఒడిశా, బెంగాల్‌లో ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.





Untitled Document
Advertisements