గాంధీలో కరోనా కలకలం...24 గంటల్లో 22 మంది మృతి ?

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 12:08 PM

గాంధీలో కరోనా కలకలం...24 గంటల్లో 22 మంది మృతి ?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ శరవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగిపోతున్నాయి. ఇటు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. గ్రేటర్‌లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో 24 గంటల్లో 22 మంది కరోనాతో మృతి చెందారు.ఇందులో ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన వారు మిగతా 17 మంది వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. మరణాల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరుగుతుండడంతో.. కొవిడ్‌ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. సమీపంలోని యూపీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు.





Untitled Document
Advertisements