ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్...రూ.10 వేల వరకు డిస్కౌంట్

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 12:25 PM

ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్...రూ.10 వేల వరకు డిస్కౌంట్

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. భారీ తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. యోనో యాప్ ఉపయోగించే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఎస్‌బీఐ యోనో కస్టమర్లు రూ.10 వేల వరకు వీక్లి డిస్కౌంట్ పొందొచ్చు. ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. ఎస్‌బీఐ యోనో ద్వారా ఈజీ మై ట్రిప్‌లో ఫ్లైట్, హోటల్స్, బస్ టికెట్లను బుక్ చేసుకుంటే రూ.10 వేల వరకు వీక్లి డిస్కౌంట్ వస్తుంది.

ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆఫర్ పొందాలని భావించే వారు రూపేఈఎంటీ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. కాగా మరోవైపు ఎస్‌బీఐ కార్డ్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. పెద్ద మొత్తంలో చేసిన కొనుగోళ్లను ఈజీ ఈఎంఐ రూపంలోకి మార్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది.

అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా కల్పిస్తోంది. కస్టమర్లు వారి కొనుగోళ్లను ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం మాఫీ కల్పిస్తోంది. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వెసులుబాటు వల్ల ఊరట కలుగుతుంది.





Untitled Document
Advertisements