మాస్క్ పెట్టుకోమన్నందుకు మున్సిపల్ సిబ్బందిపై తండ్రి కొడుకుల దాడి

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 01:55 PM

మాస్క్ పెట్టుకోమన్నందుకు మున్సిపల్ సిబ్బందిపై తండ్రి కొడుకుల దాడి

ఓవైపు కరోనా విజృంభిస్తుంటే జనాలు మాత్రం ఏ భయం లేకుండా తిరిగేస్తున్నారు. మాస్కులు, భౌతికదూరం పాటించాలని అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తున్న కొందరి పద్ధతి మారడం లేదు. పైగా మాస్క్ పెట్టుకోవాలని చెబుతున్నవారిపై కొందరు భౌతిక దాడులకు దిగుతున్నారు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
నగరంలోని గౌతం నగర్ లో మాస్క్ పెట్టుకొని చెత్త వేయాలని చెప్పినందుకు మున్సిపల్ కార్మికుల పై దాడికి దిగారు.

గౌతంనగర్‌లో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ వ్యక్తి ‘‘నేను మాస్కు పెట్టుకోకపోతే.. మీ కేంటి’’ అంటూ రెచ్చిపోయాడు. అతని కొడుకు సైతం పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి ప్రయత్నించాడు. మున్సిపల్ సిబ్బందిని నెట్టేశాడు. దీంతో తండ్రీకొడుకుల ప్రవర్తనపై మున్సిపల్‌ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.





Untitled Document
Advertisements