పెన్నులో బతికున్న పరాన్నజీవిని పెట్టి అమ్మకం...ఫుల్ డిమాండ్!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 02:09 PM

పెన్నులో బతికున్న పరాన్నజీవిని పెట్టి అమ్మకం...ఫుల్ డిమాండ్!

మన చుట్టూ ఎన్నో పరాన్నజీవులు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనిషిలో కూడా ఎన్నో రకాల పరాన్న జీవులు ఉంటాయి. పచ్చి మాంసం, చేపలు తినేవారిలో ఎక్కువగా నెమటోడ్ లేదా టేప్ వార్మ్ వంటి పరాన్నజీవులు శరీరంలోకి చేరుతాయి. మనతోపాటే అవి శరీరం లోపల పెరుగుతుంటాయి. ఇవి కడుపు నొప్పి తదితర సమస్యలకు కారణమవుతాయి. కొందరికి మెదడులో కూడా పరాన్న జీవులు తిష్ట వేస్తాయి. అలాంటి పరాన్నీ జీవులు మీతో పాటు మీరు రాసుకొనే పెన్నులో ఉంటే?

అదెలా సాధ్యం అనుకుంటున్నారా? జపాన్‌కు చెందిన ఓ సంస్థ అలాంటి పెన్నునే తయారు చేసింది. బతికున్న నెమటోడ్ పరాన్న జీవిని పెన్నులో పెట్టారు. అది బయటకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఉన్న నీటిలో ఆ పరాన్న జీవి కదులుతూ ఉంటుంది. దీంతో వినియోగదారులు ఈ పెన్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పెన్నును తమ ఆప్తులకు కానుకగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తున్నారు. పైగా ఈ పెన్ను మంచి టైంపాస్ కూడానట. పెన్ను లోపల దాని కదలికలను చూస్తూ ఎంతసేపైనా గడిపేయొచ్చట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెన్ను ఫొటోలు వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెన్ను కొనుగోలు చేయడం కోసం చాలామంది ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తున్నారట. ఈ పెన్నులో గల చిన్న పారదర్శక ట్యాంకులో ఈ పరాన్నజీవి కదులుతూ ఉంటుందని, దీని విలువ 950 యెన్ (రూ.651) మాత్రమేనని ఓ వినియోగదారుడు తెలిపాడు. ఈ పెన్నులో ఉండే పురుగు 4 నుంచి 5 రోజులు యాక్టీవ్‌గా ఉంటుందని, కాసేపు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుందన్నాడు. కొద్ది రోజుల తర్వాత అది చనిపోతుందని తెలిపాడు. మరి మీకు కూడా ఇలాంటి పెన్ను కొనుగోలు చేయాలని ఉందా? అయితే, ఆన్‌లైన్‌లో ట్రై చేయండి.







Untitled Document
Advertisements