తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఓ పక్క కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతున్నప్పటికి కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 1,26,235 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,446 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331 కి చేరింది.
అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,008 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 33,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1414 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,809 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,16,08,116 టెస్ట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 89.08 శాతం ఉండగా, మరణాల రేటు 0.52% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.