నిన్న తగ్గిన పసిడి ధర ఈరోజు పైపైకి

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 02:33 PM

నిన్న తగ్గిన పసిడి ధర ఈరోజు పైపైకి

పసిడి ప్రేమికులకు ఝలక్. బంగారం ధర పరుగులు పెట్టింది. నిన్న తగ్గిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైపైకి చేరింది. బంగారం జిగేల్ మంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరుగుదలతో రూ.48,000కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 పెరుగుదలతో రూ.44,000కు ఎగసింది.

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పెరిగింది. వెండి ధరలో కేజీకి రూ.1500 పెరుగుదలతో రూ.73,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.57 శాతం పెరుగుదలతో 1776 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 26.03 డాలర్లకు ఎగసింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.





Untitled Document
Advertisements