వివేక్ హఠాన్మరణం పట్ల TRS ఎంపీ సంతాపం...లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ప్రకటన

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:48 PM

వివేక్ హఠాన్మరణం పట్ల TRS ఎంపీ సంతాపం...లక్ష్యాన్ని  పూర్తి చేస్తామని ప్రకటన

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పేరొందిన హాస్యనటుడు వివేక్ హఠాత్తుగా మరణించడం పట్ల టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివేక్ మంచి నటుడే కాక, గొప్ప ప్రకృతి ప్రేమికుడని గుర్తు చేసుకున్నారు. గ్రీన్ కలామ్ అనే ప్రాజెక్టు ద్వారా ఆయన కోటి మెక్కలు నాటాలని సంకల్పించుకున్నారని అన్నారు. ఆ సంకల్పంలో భాగంగా ఇప్పటిదాకా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం విచారకరమని శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. వివేక్ లక్ష్యం అర్ధంతరంగా ఆగిపోకుండా మిగతా 68 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాము కొనసాగిస్తామని తెలిపారు. ఆయన ఇప్పటి దాకా 32.5 లక్షల మొక్కలు నాటడం పూర్తి చేశారని, మిగిలిన సంకల్పాన్ని తాము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పూర్తి చేస్తామని జోగినపల్లి సంతోష్ ప్రకటించారు. ప్రకృతి ప్రేమికుడు వివేక్ లక్ష్య సాధనే ఆయనకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. వివేక్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతోష్ కుమార్ శనివారం వరుస ట్వీట్లు చేశారు.











Untitled Document
Advertisements