రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేసే వారికి రూ. 500 జరిమానా

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 04:11 PM

ఇకపై కరోనా నిబంధనలను పాటించని వారిపై రైల్వేశాఖ భారీ జరిమానాలు విధించనుంది. రైల్వేకు చెందని ప్రాంతాల్లోకానీ, రైళ్లలో కానీ మాస్కు పెట్టుకోని వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఈరోజు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ నిబంధనలను అనుసరించి రైల్వే శాఖ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే రైల్వే ప్రాంగణంలోకి అడుగు పెట్టాలని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాదు రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేసే వారికి కూడా రూ. 500 జరిమానా విధించనున్నారు. రైల్వే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమ ఉత్తర్వుల్లో రైల్వే పేర్కొంది. అపరిశుభ్రత వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని, ప్రజారోగ్యం దెబ్బ తింటుందని తెలిపింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని... 6 నెలల వరకు కొనసాగుతాయని చెప్పింది.





Untitled Document
Advertisements