బ్యాంక్ ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్....పనివేళల్లో మార్పు?

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 05:13 PM

బ్యాంక్ ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్....పనివేళల్లో మార్పు?

కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కేసుకు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ అందరిలోనూ కోవిడ్ 19 భయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులపై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ టైమింగ్స్ మారే అవకాశముంది.

బ్యాంక్ యూనియన్లు ఇప్పటికే ఆర్థిక శాఖకు ఈ విషయాన్ని వెల్లడించాయి. బ్యాంక్ ఉద్యోగుల భద్రత నేపథ్యంలో వారికి పని గంటలను తగ్గించాలని లేదంటే పని దినాలను తగ్గించాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. తక్కువ సిబ్బందితో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరాయి.

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU ఇప్పటికే ఆర్థిక శాఖ కార్యదర్శి దెబాశిష్ పాండాకు మెమరాండమ్ కూడా అందించింది. కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు హాట్‌స్పాట్లుగా పని చేసే ఛాన్స్ ఉందని, అందువల్ల కేంద్రం వీలైనంత త్వరగా తగిన నిర్ణయాలతో ముందుకు రావాలని తెలిపింది.

బ్యాంక్ యూనియన్ల డిమాండ్‌ను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే శని వారం, ఆది వారం బ్యాంకులు ఇక పనిచేయకపోవచ్చు. అలాగే బ్యాంక్ పని వేళల్లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఇంకా కొంత మంది ఉద్యోగులకు వచ్చే 4 నుంచి 6 నెలల కాలంపాటు ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించాలని బ్యాంక్ యూనియన్లు కోరుతున్నాయి.





Untitled Document
Advertisements