2 వారాల్లోనే రూ.వేలల్లో పెరిగిన బంగారం ధర...ఇప్పుడు కొనచ్చా?

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 05:43 PM

2 వారాల్లోనే రూ.వేలల్లో పెరిగిన బంగారం ధర...ఇప్పుడు కొనచ్చా?

బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకో ఝలక్. ఎందుకంటారా? బంగారం ధర భారీగా పెరిగింది. ఈ నెలలో పసిడి రేటు పరుగులు పెట్టింది. ఇప్పటికే బంగారం ధర 10 గ్రాములకు రూ.2,500కు పైగా పైకి కదిలింది. పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

బంగారం ధర ఏప్రిల్ నెల ఆరంభంలో అంటే ఏప్రిల్ 1న 10 గ్రాములకు రూ.45,440 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ బంగారం ధర రూ.48 వేలకు చేరింది. అంటే పసిడి రేటు దాదాపు రూ.2,500కు పైగా పెరిగిందని చెప్పుకోవచ్చు.

అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 1న రూ.41,650 వద్ద ఉంది. కానీ ఇప్పుడు ఈ బంగారం ధర రూ.44 వేలకు పెరిగింది. రూ2300కు పైగా పెరిగిందని చెప్పుకోవాలి.

అంటే బంగారం ధర ఈ నెలలో ఇప్పటి వరకు చూస్తే భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. అంటే రెండు వారాల్లోనే బంగారం ధర రూ.వేలల్లో పెరిగింది. దీంతో బంగారం కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది. అమెరికా డాలర్ బలహీనపడటం, రూపాయి క్షీణత, కరోనా కేసులు పెరగడం, బాండ్ ఈల్డ్ తగ్గడం వంటి అంశాలు పసిడి రేటుకు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే పసిడి పడిపోయినప్పుడల్లా కొనొచ్చని సూచిస్తున్నారు.





Untitled Document
Advertisements