5,093 మందికి కరోనా వైరస్ పాజిటివ్

     Written by : smtv Desk | Sun, Apr 18, 2021, 08:46 PM

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో ఈ మహమ్మారి ప్రభావం చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో మరో 1,29,637 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 5,093 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి ఇవే అత్యధిక కేసులు అని చెప్పాలి. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,51,424 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 15 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,824 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,555 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 3,12,563 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 37,037 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.





Untitled Document
Advertisements