కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:04 AM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భారీ ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న 6, 7, 8 విడత ఎన్నికల ప్రచార ర్యాలీలు, రోడ్‌ షోలను రద్దు చేసుకున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు.

‘‘ కోవిడ్ తీవ్రత నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో నా ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నాను. భారీ ర్యాలీల కారణంగా కరోనా పర్యవసనాలను మిగిలిన పార్టీల నేతలు కూడా ఆలోచించాలని కోరుతున్నాను.’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారని.. కరోనా పరిస్థితుల్లో భారీ ర్యాలీలు, రోడ్‌ షోలలో ఆయన పాల్గొంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మోదీ బహిరంగ సభలు నిర్వహిస్తుండడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. తాజాగా రాహుల్ గాంధీ తన పర్యటనలను రద్దు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోదీ ప్రతిపక్ష నేత సూచనలపై ఏమంటారో వేచిచూడాలి మరి!!





Untitled Document
Advertisements