బ్యాంక్ లక్షాధికారి స్కీమ్...రూ.595తో!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:08 AM

బ్యాంక్ లక్షాధికారి స్కీమ్...రూ.595తో!

ప్రతి ఒక్కరూ మిలియనీర్ అయిపోవాలని కలలు కంటూ ఉండొచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యంకాకపోవచ్చు. లక్షాధికారి కావాలని కల కనే వారికి ఒక బ్యాంక్ అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంచింది. దీని ద్వారా కస్టమర్లు లక్షాధికారులు అయిపోవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ప్రత్యేక స్కీమ్ అందిస్తోంది. దీని పేరు సెంట్ ల్యాక్‌పతి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల కస్టమర్లు ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా డబ్బులు వెనకేసుకోవచ్చు. ఏడాది నుంచి పదేళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ 2016 డిసెంబర్ నెలలోనే ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మీరు ఏడాదిలోనే లక్షాధికారి అవ్వాలంటే నెలకు రూ.8 వేలు డిపాజిట్ చేయాలి. మీకు 6.65 శాతం వడ్డీ వస్తుంది. అదే మీరు పదేళ్లలో లక్షాధికారి అవ్వాలంటే నెలకు రూ.595 కడితే చాలు. ఏడాదిలోపు లక్షాధికారి అవ్వాలని భావించే వారికి బ్యాంక్ 6.65 శాతం వడ్డీ అందిస్తుంది. మిగతా వారికి 6.45 శాతం వడ్డీ వస్తుంది.

మీరు రెండేళ్లలో మిలియనీర్ అవ్వాలని భావిస్తే.. నెలకు రూ.3,900 కట్టాలి. అదే ఐదేళ్లలో లక్షాధికారి కావాలని యోచిస్తే.. అప్పుడు నెలకు రూ.1411 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి నెలా తక్కువ మొత్తంతో రూ.లక్ష పొందాలని భావించే వారికి ఈ స్కీమ్ అనుగుణంగా ఉంటుంది.





Untitled Document
Advertisements