ప్రధాని మోదీకి దీదీ లేఖ...సాయం అందించాలని వినతి

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:42 AM

ప్రధాని మోదీకి దీదీ లేఖ...సాయం అందించాలని వినతి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వంపై ఎప్పుడూ విరుచుకుపడే బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ రూటు మార్చారు. ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశారు. అయితే అదేమీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి కాదులెండి!! రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు మమత. రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ఆమె కోరారు.

పశ్ఛిమ బెంగాల్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. యుద్ధం తరహాలో కరోనాపై పోరాడాల్సి ఉంది. అందుకు అవసరమైన సాయం అందించాలని ఆమె కోరారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ పంపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో బయటి రాష్ట్రాల నుంచి బీజేపీ గూండాలు వస్తున్నారని విమర్శలు చేసిన మమత.. కోవిడ్ లేఖలోనూ ఆ విషయం ప్రస్తావించడం గమనార్హం. ప్రచారం పేరుతో బయటి రాష్ట్రాల వ్యక్తులు కూడా వస్తున్నారని.. ఇలాంటి సందర్భంలో కరోనా కట్టడికి యుద్ధం తరహాలో పోరాడాల్సిన అవసరముందని ఆమె పేర్కొనడం విశేషం.





Untitled Document
Advertisements