ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్...అకౌంట్లలోకి డబ్బులు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:44 AM

ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్...అకౌంట్లలోకి డబ్బులు

కరోనా వైరస్ ప్రభావం అందరిపై పడింది. అనేకమంది ఉపాధి కోల్పోయారు. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం ప్రజల్ని ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టింది. కేంద్ర సర్కార్ సైతం ప్యాకేజీలు ప్రకటించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రవైట్ టీచర్లకు మద్దతుగా ప్రభుత్వం నిలిచింది. లాక్‌డౌన్‌తో ప్రైవేట్ స్కూళ్లు మూతపడడంతో.. ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పొన అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ప్రభుత్వమందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004 మందిని సాయం కోసం ఎంపికచేశారు.

వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశమున్నట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఎంపికైన వారికి మంగళవారం అంటే రేపటి నుంచి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధంచేసింది.





Untitled Document
Advertisements