కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. రోజుకి 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. సరైన చికిత్స అందక కరోనా రోగులు వైరస్కి బలైపోతున్నారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 68 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 500కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 68,631 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 503 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 60,473 మంది కరోనాకి బలయ్యారు. మొత్తం రాష్ట్రంలో 6,70,388 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.