కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.5 వేలు!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:00 PM

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.5 వేలు!

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కోవిడ్ 19 నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. మార్చి 1 నుంచే ఇది ప్రారంభమైంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ పొందొచ్చు.

కరోనా వ్యా్క్సినేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమంతో ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు రూ.5 వేలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన వేయించుకునే ఫోటోలు తీసుకోవాలి.

మీరు కరోనా వ్యాక్సిన్ వేసుకుంటున్న ఇంజెక్షన్ లేదా? మీ కుటుంబ సభ్యుల ఫోటోలను షేర్ చేయాలి. వీటికి మంచి ట్యాగ్‌లైన్ పెట్టాలి. కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్యం ఏంటో తెలియజేయాలి. ఇలా మంచి ట్యాగ్‌తో ఫోటోలు షేర్ చేయాలి. ప్రతి నెలా 10 మంది బెస్ట్ ఎంట్రీస్‌కు రూ.5,000 చొప్పున అందిస్తారు.

2021 డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మై గౌ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి ముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్ వంటి వాటి ద్వారా లాగిన్ అవ్వొచ్చు. లేదంటే మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అయ్యే అవకాశముంది. లాగిన్ అయిన తర్వాత మీ ఫోటోలను అప్‌లోడ్ చేసి షేర్ చేయాలి. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరువొద్దు.





Untitled Document
Advertisements