మహిళలకు ప్రతి సంవత్సరం రూ.36 వేలు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:51 PM

మహిళలకు ప్రతి సంవత్సరం రూ.36 వేలు

మహిళలకు ప్రతి సంవత్సరం రూ.36 వేలు రాబోతున్నాయి. ఎలా అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరిన వారికే ఈ డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ పేురు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు.

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో ఇప్పటి వరకు 21 లక్షల మందికి పైగా చేరారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ ఏడాదికి రూ.36 వేలు లభిస్తాయి. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ డబ్బులు చెల్లిస్తుంది.


అయితే మహిళలకు 60 ఏళ్లు వచ్చిన తర్వాతనే ప్రతి ఏడాది రూ.36 వేలు అందిస్తారు. ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఈ డబ్బులు వస్తాయి. అయితే ఇందులో చేరేందుకు అందరికీ అవకాశం లేదు. రైతులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మహిళా రైతులు కూడా స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.


అయితే ఇలా స్కీమ్‌లో చేరిన వారు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది. ఉచితంగానే స్కీమ్‌లో చేరొచ్చు. ఒకవేళ మీరు మధ్యలో స్కీమ్ నుంచి తప్పుకోవాలని భావిస్తే.. మీ డబ్బులు మీకు ఇస్తారు.

ఒకవేళ స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే.. భాగస్వామికి సగం డబ్బులు వస్తాయి. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి స్కీమ్‌లో చేరొచ్చు. రెండు ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు వంటివి కావాలి. ఇంకా మీకు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉంటే.. వచ్చే రూ.6 వేల డబ్బులతోనే మాన్ ధన్ స్కీమ్ డబ్బులు చెల్లించొచ్చు.





Untitled Document
Advertisements