ఏడాదిలో రెట్టింపు లాభం

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:30 PM

ఏడాదిలో రెట్టింపు లాభం

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికీ ఎస్‌బీఐ అంటే తెలుసు. బ్యాంక్ ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాలు వరకు కస్టమర్లకు చాలా సేవలు ఆఫర్ చేస్తోంది.

బ్యాంక్ ఏ చిన్న విషయం ఉన్నా కూడా కస్టమర్లకు తెలియజేస్తుంది. ట్విట్టర్ వేదికగా బ్యాంక్ ఖాతాదారులకు వెల్లడి చేస్తుంది. ఇలాంటి బ్యాంక్ ఇతర బ్యాంకుల కన్నా ఒక విషయంలో ముందంజలో ఉంది. కస్టమర్లకు అదిరిపోయే రాబడి అందిస్తోంది.

ఎస్‌బీఐ షేరు ధర ఏడాది కాలంలోనే ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభాన్ని అర్జించి పెట్టింది. అంటే ఏడాది కిందట రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మీకు రూ.2 లక్షలు వచ్చేవి. 2020 మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ.171 వద్ద ఉండేది. 2021 మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ.356కు ఎగసింది.

ఇకపోతే ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. 5.8 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఎఫ్‌డీలో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే రాబడి తక్కువగా ఉంటుంది. అదేసమయంలో స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ రాబడి వస్తుంది. అయితే రిస్క్ మాత్రం ఎక్కువగా ఉంటుందని గమనించాలి.





Untitled Document
Advertisements