స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ప్రభావం..!

     Written by : smtv Desk | Mon, Dec 18, 2017, 11:33 AM

స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ప్రభావం..!

ముంబై, డిసెంబర్ 18 : ఈరోజు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడనుంది. దీంతో ఒక్కసారిగా మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశముంది. ఈ గుజరాత్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో బీజేపీ గెలుస్తుందనే అంచనాలు వెలువడ్డాయి.

ఈ మేరకు ఇప్పుడా ప్రభావమంతా మార్కెట్‌ సెంటిమెంట్‌పై చూపనున్నాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లు కోల్పోయి.. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఆ తర్వాత బీజేపీ ముందంజలో ఉండగా స్టాక్‌ మార్కెట్లు కుదుటపడ్డాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 170 పాయింట్ల లాభంతో 33,633 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 10,389 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.





Untitled Document
Advertisements