ముంబై, డిసెంబర్ 18 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఒక్కరోజే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు ట్రేడ్ అయ్యింది. మొదట్లో నష్టాల బాట పట్టినా ఆ తర్వాత కాస్త కోలుకొని లాభాల బాట పట్టింది. ఈరోజు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాజపా విజయం సాధించింది. మొదట్లో సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది.
అనంతరం భాజపా విజయం బాటలో పయనించగా అదే బాటలో సూచీలు కూడా పయనించాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 300 పాయింట్ల లాభంతో ట్రేడ్ కాగా మదుపర్ల లాభ స్వీకరణతో 139 పాయింట్ల లాభానికి పరిమితమైంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి 33,602 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 55 పాయింట్ల లాభంతో 10,389 వద్ద ముగిసింది.