కటక్ చేరిన భారత్, శ్రీలంక జట్లు...

     Written by : smtv Desk | Tue, Dec 19, 2017, 12:13 PM

కటక్ చేరిన భారత్, శ్రీలంక జట్లు...

కటక్, డిసెంబర్ 19 : తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను రోహిత్ సేన 2-1 తో కైవసం చేసుకుంది. ఇప్పుడు మూడు టీ-20 ల సీరీస్ కు ఇరు జట్లు పోరాటానికి సిద్ధమయ్యాయి. కాగా తొలి టీ-20 మ్యాచ్ రేపు కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ నిమిత్తం ఇరు జట్లు భువనేశ్వర్ చేరుకున్నాయి. వన్డే సీరీస్ లో ఘోర పరాభావం చవిచూసిన శ్రీలంక.. టీ-20 సీరీస్ ను ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. కాగా టీమిండియా మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.





Untitled Document
Advertisements