ముంబై, డిసెంబర్ 19 : ఇన్ఫోకస్ డ్యూయల్ కెమెరా ఫోన్ను భారత్లో విడుదల చేశారు. ఢిల్లీలో "విజన్ 3" పేరిట జరిగిన కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించారు. 5.70 అంగుళాల తాకే తెరతో 1.3గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13+5 ఎంపీ వెనుక కెమెరాలు, 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0నౌగట్ ఓస్ , 16జీబీ అంతర్గత స్టోరేజీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. కాగా దీని ధరను రూ.6,999గా నిర్ణయించారు. వోఎల్టీఈ సదుపాయం కలిగిన ఈ ఫోన్ అమ్మకాలు అమేజాన్లో ఎక్స్క్లూజివ్గా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.