ముంబై, డిసెంబర్ 21 : నిన్న నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా లాభార్జనతో ట్రేడింగ్ను ఆరంభించగా, నిఫ్టీ కూడా 10,450 పైన ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 33,791 వద్ద ఉండగా, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 10,452 వద్ద కొనసాగుతున్నాయి. కాగా మదుపర్ల నుంచి కొనుగోళ్లు, అమెరికా పన్ను సంస్కరణలు మార్కెట్ కు కలిసొచ్చాయి. కాని మిడ్క్యాప్ షేర్లు కాస్తంత నష్టాల్లో ఉండటంతో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.