భారత్, ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ మధ్య మొదలైన ఏకైక టెస్టు

     Written by : smtv Desk | Wed, Jun 16, 2021, 05:36 PM

భారత్, ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ మధ్య మొదలైన ఏకైక టెస్టు

భారత మహిళల జట్టుతో బ్రిస్టోల్ వేదికగా ఈరోజు ఆరంభమైన ఏకైక టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మహిళల జట్టు కెప్టెన్ హేథర్ నైట్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2014లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన భారత్ జట్టు.. కెప్టెన్ మిథాలీ రాజ్‌ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడుతోంది. లేడీ వీరేంద్ర సెహ్వాగ్‌గా పేరొందిన ఓపెనర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంగ్లాండ్ దూకుడు బ్యాటర్‌గా ప్రశంసలు అందుకున్న సోఫియా కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసింది.

2014లో భారత్ ఆఖరి టెస్టులో ఆడిన ఏడుగురు క్రికెటర్లు మాత్రమే ప్రస్తుతం టీమ్‌లో ఉండగా.. షెఫాలి వర్మతో పాటు దీప్తి, పూజా, తనియా భాటియా ఈ మ్యాచ్‌తో టెస్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అలానే ఐదేళ్ల తర్వాత స్నేహ్ రాణా మళ్లీ భారత్ జట్టులోకి వచ్చింది.

రికార్డుల పరంగా చూసుకుంటే.. భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్లు ఇప్పటి వరకూ 13 టెస్టుల్లో తలపడగా.. ఇందులో ఇంగ్లాండ్ టీమ్ ఒకటి, భారత్ రెండు టెస్టుల్లో విజయం సాధించింది. మిగిలిన 10 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక ఇంగ్లాండ్ గడ్డపై 8 టెస్టుల్లో ఢీకొనగా.. ఇందులో భారత్ రెండు టెస్టుల్లో విజయం సాధించింది. మిగిలిన రెండు ఆరు టెస్టులు డ్రాగా ముగిశాయి.

India Women (Playing XI): Smriti Mandhana, Shafali Verma, Punam Raut, Mithali Raj(c), Harmanpreet Kaur, Deepti Sharma, Sneh Rana, Taniya Bhatia(w), Jhulan Goswami, Pooja Vastrakar, Shikha Pandey


England Women (Playing XI): Lauren Winfield Hill, Tammy Beaumont, Heather Knight(c), Natalie Sciver, Amy Ellen Jones(w), Sophia Dunkley, Georgia Elwiss, Katherine Brunt, Anya Shrubsole, Sophie Ecclestone, Kate Cross





Untitled Document
Advertisements