ట్విటర్‌పై దేశంలో రెండో కేసు....హైదరాబాద్‌లో నమోదు!

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 04:58 PM

ట్విటర్‌పై దేశంలో రెండో కేసు....హైదరాబాద్‌లో నమోదు!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై దేశంలోనే రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకుగాను ఈ కేసును నమోదు చేశారు. అంతేకాక, కేసు పెట్టి.. ట్విటర్ ఇండియా యాజమాన్యానికి పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విటర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ట్విటర్ వెంటనే స్పందించాలని నోటీసులో కోరారు. నోటీసుతోపాటు ట్విటర్‌ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు. పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను కూడా తమకు అందించాలని పోలీసులు ట్విటర్‌కు రాసిన లేఖలో కోరారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విటర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది. సామాజిక మాధ్యమాల్లో డిజిట‌ల్ కంటెంట్‌పై నియంత్రణ‌కు గానూ కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీని ప్రకారం.. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements