న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్కు బంపర్ ఆఫర్ తగిలింది. 2.25 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.14వేల కోట్లు)తో టెలివిజన్ రేటింగ్ మెజర్మెంట్ సంస్థ నీల్సన్తో టీసీఎస్కు ఒప్పందం కుదిరింది. డిసెంబరు 31, 2025 వరకు ఈ ఒప్పందం కొనసాగను౦ది. భారత్ కు చెందిన ఓ ఐటీ సంస్థకు పెద్ద అవుట్సోర్సింగ్ డీల్ ఇదే కావడం విశేషం.
2007లో తొలిసారి టీసీఎస్కు నీల్సన్తో డీల్ కుదిరింది. అయితే 2013లో ఆ డీల్ను 2020 వరకు పొడిగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాని తాజాగా మరోసారి డీల్ను పొడిగించారు. ఈ కొత్త నిబంధన ప్రకారం.. మరో ఐదేళ్లపాటు అనగా 2025 వరకు నీల్సన్.. టీసీఎస్ సేవలను ఉపయోగించుకోనుంది.