భూమిలో బంగారు నాణాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇంటి పునాదుల కోసం మానపాడు మండల కేంద్రంలో భూమిని తవ్వారు. ఇంతలో భూమిలోపల బంగార నాణాల్ని గుర్తించారు కూలీలు. దీంతో ఇంటి యజమానికి తెలియకుండా వారే దొరికిన బంగారాన్ని పంచకున్నారు. అయితే పంపకాల్లో వివాాాదాలు తలెత్తాయి.
పునాదుల తవ్వకాల్లో సుమారు 1000కు పైగా నాణ్యాలు లభ్యమయ్యాయి. ఇంటి పునాదులు తవ్వుతుంటే కూలీలకు దొరికాయి. దీంతో ఇంటి యజమానికి తెలియకుండా వాటిని పంచుకున్నారు కూలీలు.
పంపకాల్లో తేడా కారణంగా ఈ వ్యహారం బయటపడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. పలువురు కూలీలను అదుపులోకి విచారిస్తున్నారు.