న్యూఢిల్లీ, డిసెంబర్ 27: చైనా మొబైల్ ఉత్పత్తుల సంస్థ షావోమి, తన రెడ్మి 5ఏ స్మార్ట్ఫోన్ను దేశ వ్యాప్తంగా ఆఫ్లైన్గా అందుబాటులోకి తీసుకురానుంది. రెండు వేరియంట్లలో విడుదలైన రెడ్మి 5ఏ, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, ఎం.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో లభిస్తుంది.
2జీబీ ర్యామ్ వేరియంట్ను రూ.4,999కు విక్రయిస్తోంది. 3జీబీ ర్యామ్ వెర్షన్ను కూడా ఆన్లైన్, ఎంఐ హోమ్ స్టోర్ల వద్ద రూ.6,999కు అమ్ముతోంది. కానీ ఆఫ్లైన్కు వచ్చేసరికి ఈ వేరియంట్ ధరను షావోమి పెంచేసింది. దీని రూ.7,499 వరకు విక్రయిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
'రెడ్మి 5ఏ' ఫీచర్లు ఇలా...
# హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్
#5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
#2జీబీ/ 3జీబీ ర్యామ్
#16జీబీ/ 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
# 128జీబీ వరకు విస్తరణ మెమరీ
#13 ఎంపీ రియర్ కెమెరా
#3000 ఎంఏహెచ్ బ్యాటరీ
# ఎంఐయూఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్
#1.4గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్