ముంబాయి, డిసెంబర్ 27: కొత్త శిఖరాలను అధిరోహించిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 34,087 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 10,537 వద్ద కొనసాగుతున్నాయి. హెల్త్కేర్, చమురు రంగాల షేర్ల అండతో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
రిలయన్స్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా షేర్లు లాభాల్లో ఉండగా.. విప్రో, బాష్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెగా రుణ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్లు 20 శాతం పైకి ఎగిశాయి.