IPL చరిత్రలో ఒకే ఒక్కడు

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:37 AM

IPL చరిత్రలో ఒకే ఒక్కడు

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత సునీల్ నరైన్‌ని టార్గెట్‌ చేయబోయి లాంగాన్‌లో ఫీల్డర్ శుభమన్ గిల్ చేతికి చిక్కాడు. ఐపీఎల్‌లో ఇలా ఒకే జట్టుపై 1000 పరుగుల మార్క్‌ని అందుకున్న ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 1011 పరుగులు చేయగా.. అతని తర్వాత స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ రికార్డ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌పై వార్నర్ ఇప్పటి వరకూ 943 పరుగులు చేశాడు. అలానే కోల్‌‌కతాపై కూడా 915 పరుగులు చేసిన వార్నర్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ 909 పరుగులతో ఉండగా.. అతను ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆ పరుగులు చేశాడు.





Untitled Document
Advertisements