కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు?

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 11:23 AM

కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు?

పండగైన, పర్వదినమైన, శుభకార్యమైనా హైందవ సంస్కృతిలో కొత్తబట్టలు ధరించడం అనేది తప్పనిసరి. అయితే ఈ కొత్త బట్టలు ధరించడానికి ముందు వాటికి పసుపు రాస్తూ ఉంటారు మన ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు. కొత్త బట్టలకు పసుపు రాయడానికి గల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త బట్టలకు పసుపు రాయడం అనే ఈ ఆచారాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం పెట్టారు. పూర్వం బట్టలను మగ్గాలపై నేసేవారు. బట్టలు నేసే ముందు నూలుకు పిండితో తయారయిన గంజి పెట్టేవారు. అలా గంజి పెట్టి వస్త్రాలు నేయటం వల్ల అనేక రోగ కారక క్రిములు వస్త్రాల్లో చేరతాయని, అలాంటి వస్త్రాలు ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును బట్టలకు నలువైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు. పసుపు శుభప్రధానికి చిహ్నం.





Untitled Document
Advertisements